జనసేన క్రియాశీల కార్యకర్త వసంత రాయల కుటుంబానికి బీమా చెక్కును ఇచ్చిన పవన్ కళ్యాణ్

భారత్ న్యూస్ విశాఖపట్నం..జనసేన క్రియాశీల కార్యకర్త వసంత రాయల కుటుంబానికి బీమా చెక్కును ఇచ్చిన పవన్ కళ్యాణ్

Ammiraju Udaya Shankar.sharma News Editor…గతేడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన
క్రియాశీల కార్యకర్త వసంత రాయల కుటుంబాన్ని
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం
పరామర్శించారు.

పెద చందాలలోని వారి నివాసానికి చేరుకున్న ఆయన.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా పార్టీ తరపున మంజూరైన ప్రమాద బీమా చెక్కును బాధితులకు అందజేశారు.

ఆపదలో ఉన్న కార్యకర్తల కుటుంబాలకు జనసేన పార్టీ
ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా
పవన్ హామీ ఇచ్చారు.