భారత్ న్యూస్ మంగళగిరి ..Ammiraju Udaya Shankar.sharma News Editor…మంగళగిరి: భారతీయ శక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక చేనేతలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు.
అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ నెల నుంచే 200యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నాం: ముఖ్యమంత్రి చంద్రబాబు
మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తాం.
ఉచిత విద్యుత్ వల్ల 93 వేల కుటుంబాలకు లబ్ధి కలుగుతుంది.
