భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీలో త్వరలో పురపాలక ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు!
అమరావతి :-
ఏపీ రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నిర్వహణకు ముందస్తు సన్నాహాలు మొదలయ్యాయి. 13
నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమైంది. వీటిలో ప్రస్తుతం 3,206 డివిజన్లు, వార్డులు ఉన్నాయి. పునర్విభజనతో డివిజన్లు, వార్డుల సంఖ్య 3,942కి పెరగనుంది. ఆగస్టు, సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలోనే డివిజన్లు, వార్డుల పునర్విభజనకు వేర్వేరుగా నోటిఫికేషన్లను ఇటీవల జారీ చేసింది….
