భారత్ న్యూస్ గుంటూరు….బంగాళాఖాతంలో వాయుగుండం.. తీరం దాటనున్న తుఫాను
Jan 09, 2026,
బంగాళాఖాతంలో వాయుగుండం.. తీరం దాటనున్న తుఫాను
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి శ్రీలంకలోని హంబన్తోట, బట్టికోల మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

దీని ప్రభావంతో నేడు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.