భారత్ న్యూస్ రాజమండ్రి…అమెరికాలో జాహ్నవి కందుల మృతి కేసు.. కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం
సియాటెల్: అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యం కారణంగా తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది.
