పట్టాలెక్కనున్న భారత్ తొలి హైడ్రోజన్ రైలు!

భారత్ న్యూస్ విశాఖపట్నం..పట్టాలెక్కనున్న భారత్ తొలి హైడ్రోజన్ రైలు!

భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. హర్యానాలోని జింద్ – సోనిపట్ మార్గంలో జనవరి 26 నుంచి ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. పూర్తి స్వదేశీ
సాంకేతికతతో రూపొందిన ఈ రైలు, గంటకు 150 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. కాలుష్య రహితంగా నడిచే ఈ రైలులో ఆటోమేటిక్ డోర్లు, డిజిటల్ డిస్ప్లే వంటి అత్యాధునిక వసతులు ఉన్నాయి. ఇది భారత రైల్వేలో సరికొత్త పర్యావరణ విప్లవానికి నాంది పలకనుంది.