భారత్ న్యూస్ అనంతపురం..నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. 69 మంది ఔట్…
APSPDCLలో నకిలీ ధ్రువపత్రాలతో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు పొందిన 69 మందిపై చర్యలు చేపట్టారు.
ఐటీఐ (ఎలక్ట్రిషియన్) చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు విచారణలో తేలింది.
దీంతో వారిని తొలగించాలని సంబంధిత ఏజెన్సీలకు సీఎండీ శివశంకర్ లోతేటి నోటీసులు జారీ చేశారు.

వారిలో జిల్లాల వారీగా.. కడప 38, కర్నూలు 16, తిరుపతి 3, చిత్తూరు 4, నెల్లూరు 4, అనంతపురం 3, అన్నమయ్య జిల్లాలో ఒకరు ఉన్నారు.