భారత్ న్యూస్ గుంటూరు…ఈ నెల 23 నుంచి 26 వరకు సచివాలయాల్లో ఆధార్ నమోదుకు అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వం
📍దసరా సెలవుల నేపథ్యంలో ఆధార్ నమోదు, సవరణ కోసం ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు సిద్ధమైంది.
ఈ నెల 23 నుంచి 26 వరకు నాలుగు రోజుల పాటు ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది.
దీని కోసం ఎంపిక చేసిన సచివాలయాల సిబ్బందికి ఇప్పటికే సాఫ్ట్వేర్ వినియోగం, బయోమెట్రిక్ విధానం తదితర అంశాల్లో వారికి శిక్షణ ఇచ్చామని అధికారులు తెలిపారు
