దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆహ్వానించారు.

భారత్ న్యూస్ మంగళగిరి…Ammiraju Udaya Shankar.sharma News Editor…దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా ఉత్సవాలకు రావాల్సిందిగా క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎంను ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దుర్గ గుడి ఈవో శీనా నాయక్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, అర్చకులు పాల్గొన్నారు.