ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ!

భారత్ న్యూస్ రాజమండ్రి…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ!

✰ ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌ల పంపిణీ పైన కీలక నిర్ణయం తీసుకుంది.

✰ ఈ కొత్త కార్యక్రమం కోసం ప్రభుత్వం ఇన్ఫోసిస్‌ తో కలిసి పనిచేయనుంది. దీనిని ‘ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డు’ స్కీమ్‌గా అమలు చేస్తారు.

➥ ముఖ్య ఉద్దేశం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడం.

✰ తొలి విడతగా ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా మంగళగిరి నియోజకవర్గంలో అమలు చేయాలని నిర్ణయించారు. దీని ఫలితాల ఆధారంగా త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలుకు కార్యాచరణ సిద్ధం అవుతోంది.

✰ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (CSR) కింద ఇన్ఫోసిస్ సంస్థ మంగళగిరిలోని 38 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఒక్కొక్క దానికి 30 ట్యాబ్‌లను అందించింది.