భారత్ న్యూస్ రాజమండ్రి…ఎంపీ బాలశౌరికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ శుభాకాంక్షలు
అవనిగడ్డ:
మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం మచిలీపట్నంలో ఎంపీ బాలశౌరి తమ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేలు, హైవే అథారిటీ అధికారుల సమావేశంలో ఆయనను కలిసి సత్కరించారు. పండ్లు బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు.
