యాసిడ్‌ లారీని ఢీకొన్న అయ్యప్ప స్వాముల బస్సు

భారత్ న్యూస్ విజయవాడ…యాసిడ్‌ లారీని ఢీకొన్న అయ్యప్ప స్వాముల బస్సు

పీలేరు–కల్లూరు రోడ్డుపై తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

పీలేరు:

పీలేరు–కల్లూరు మార్గంలో శనివారం వేకువజామున పెద్ద ప్రమాదం తప్పింది. అయ్యప్ప స్వాముల తో వెళ్తున్న బస్సు, ముందు వెళ్తున్న యాసిడ్‌ లారీని వెనుక వైపు నుంచి ఢీకొన్న ఘటన ఎం.జె.ఆర్‌ కళాశాల సమీపంలో చోటుచేసుకుంది.

ధాటికి లారీ నుండి యాసిడ్‌ నేలపై కారిపోవడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. విషయం తెలుసుకున్న పీలేరు హెడ్‌ కానిస్టేబుల్‌ మణి వెంటనే ఫైర్‌ ఇంజిన్‌ రప్పించి యాసిడ్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నారు. ప్రాథమికంగా బస్సు డ్రైవర్‌ అజాగ్రత్త ప్రమాదానికి కారణమని సమాచారం.