భారత్ న్యూస్ అనంతపురం.ఈనెల 17నుంచి 26 వరకు పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు పాఠశాలల్లో మరో విడత ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ఆ శాఖ డైరక్టర్ శివప్రసాద్ బుధవారం కలెక్టర్లకు లేఖ రాశారు.
రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు తర్వాత నాలుగేళ్లుగా మారు మూల ప్రాంతాల్లోనూ ఆధార్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఆధార్ జారీ సంస్థ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 15.46 లక్షల మంది పిల్లలు తమ ఆధార్ బయోమెట్రిక్ ఆప్డేట్ చేసుకోవాల్సి ఉంది..