భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 50:50 భాగస్వామ్యంతో మెట్రో ప్రాజెక్టుల నిర్మాణాలు.
విశాఖ మెట్రోకు రాష్ర్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.4,101 కోట్లు ఇవ్వాలని నిర్ణయం. విశాఖ మెట్రోకు వీఎంఆర్డీఏ నుంచి నిధులు ఇవ్వాలని నిర్ణయం విజయవాడ మెట్రోకు సీఆర్డీఏ నుంచి నిధులు ఇవ్వాలని నిర్ణయం. సీఆర్డీఏ నుంచి రూ. 3,497 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాలని నిర్ణయం. విజయవాడ, విశాఖ మెట్రో రైలుకు రేపు టెండర్లు పిలవనున్న ప్రభుత్వం. రూ.21,616 కోట్లతో విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లు. రూ.10,118 కోట్లతో విజయవాడ మెట్రో రైలుకు టెండర్లు. రూ.11,498 కోట్లతో విశాఖ మెట్రో రైలుకు టెండర్లు.
