మద్యం కేసు.. విజయసాయిరెడ్డికి సిట్‌ నోటీసులు

భారత్ న్యూస్ విజయవాడ…మద్యం కేసు.. విజయసాయిరెడ్డికి సిట్‌ నోటీసులు

విజయవాడ:

ఏపీ మద్యం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్‌ మరోసారి నోటీసులు జారీ చేసింది.

ఈ నెల 12న విచారణకు రావాలని ఆదేశించింది. ఉదయం 10 గంటలకు సిట్‌ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది.

ఇప్పటికే మద్యం కేసులో సిట్‌ అధికారులు విజయసాయిరెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే.