భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ ప్రభుత్వం – కీలక ప్రకటన
పేద బ్రాహ్మణుల కోసం ‘గరుడ’ పథకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం ‘గరుడ’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది.
బ్రాహ్మణ కుటుంబంలో మరణం సంభవిస్తే
సంబంధిత కుటుంబానికి రూ. 10,000/- ఆర్థిక సాయం అందజేయనున్నారు.
ఈ పథకం కష్ట సమయంలో బ్రాహ్మణ కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు రూపకల్పన చేయబడింది.
ఇప్పటికే పథకం అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభమైంది.
అమరావతి సచివాలయంలో
మంత్రి సవిత గారు – బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్ గారితో సమావేశమై
గరుడ పథకం అమలు విధానంపై చర్చించారు.

అధికారిక మార్గదర్శకాలు విడుదలైన వెంటనే పూర్తి వివరాలు తెలియజేయబడతాయి.