మన దేశం చుట్టూ ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు పాకిస్తాన్ కుట్రలు

భారత్ న్యూస్ అనంతపురం…మన దేశం చుట్టూ ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు పాకిస్తాన్ కుట్రలు పన్నుతోందని భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

సరిహద్దు దేశాలు నేపాల్‌, బంగ్లాదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాద శిక్షణ పొందేవారి కోసం కొత్త శిక్షణ శిబిరాలు, ఇళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు నిఘావర్గాలు తెలియజేశాయి.