..భారత్ న్యూస్ హైదరాబాద్….అమీర్పేట్లో 521 గ్రాముల గంజాయి స్వాధీనం
బుధవారం అమీర్పేట్లో గంజాయి విక్రయిస్తున్న సికింద్రాబాద్కు చెందిన కుందన్కుమార్ జా అనే వ్యక్తిని ఎస్టిఎఫ్ సి టీం అరెస్ట్ చేసింది. సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ మంజు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్లో నిందితుడి వద్ద 521 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి, నిందితుడిని అమీర్పేట్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు…
