పరకామణి కేసులో ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

భారత్ న్యూస్ విజయవాడ…పరకామణి కేసులో ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

పరకామణిలో అక్రమాలపై ఇచ్చిన ఆదేశాలను..
అమలు చేయకపోవడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

పోలీస్‌శాఖ నిద్రపోతోందా అని ప్రశ్నించిన హైకోర్టు

కేసు దర్యాప్తులో కీలకమైన రికార్డులను..
సీజ్‌ చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్న కోర్టు

సీఐడీలో ఐజీ పోస్టు లేదనే కారణంతో..
ఆదేశాలు అమలు చేయరా అని ప్రశ్నించిన కోర్టు

నిబద్ధత ఉంటే ఐజీ స్థాయి అధికారిని నియమించి..
రికార్డులు సీజ్‌ చేయమని డీజీపీ ఆదేశాలు ఇచ్చేవారు

ఆధారాలు తారుమారు చేసేందుకు వీలుగా..
తప్పు చేసినవారికి సహకరించారన్న హైకోర్టు

రికార్డులు సీజ్‌ చేసి హైకోర్టు ముందు ఉంచాలని..
సీఐడీ డీజీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు

విచారణ ఈ నెల 17కు వాయిదా వేసిన హైకోర్టు