భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం మరో షాక్
రోడ్లు భద్రతా పన్ను పేరిట ప్రజలపై మరో భారం వేయనున్న ప్రభుత్వం
సంవత్సరానికి రూ. 270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా
తెలంగాణ రాష్ట్రంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారిపై మరో కొత్త పన్ను విధించేందుకు సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
రోడ్ల భద్రత సెస్ పేరిట ద్విచక్ర వాహనంపై రూ. 2 వేలు, కార్లపై రూ.5 వేలు, ఇతర హెవీ వాహనాలపై రూ. 10 వేలు వసూలు చేయాలని నిర్ణయించిన రవాణా శాఖ
ఈ సరికొత్త సెస్ వల్ల సంవత్సరానికి రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అధికారుల అంచనా
రిజిస్ట్రేషన్ సమయంలో ఈ సెస్ వసూలు చేయాలని నిర్ణయం
అసెంబ్లీలో ఆమోదం పొందిన వెంటనే అమలు చేసే ఆలోచనలో రవాణా శాఖ
