ఇందిరమ్మ ఇళ్లకు క్యూ కట్టిన జనం
…భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణ :
ఇందిరమ్మ ఇళ్లకు క్యూ కట్టిన జనం
సొంతింటిని ఆశిస్తున్న అనేక మంది ప్రజాభవన్ బాట పట్టారు.
ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకునేందుకే శుక్రవారం దాదాపు 500 మంది ప్రజావాణిలో వినతులు ఇచ్చారు.
ప్రజావాణికి మొత్తం 1010 అర్జీలు రాగా… రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ప్రజావాణి ఇన్ఛార్జి డా.జి.చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్ అర్జీదారుల సమస్యలు విని వినతి పత్రాలు స్వీకరించారు..