
నియోజకవర్గల వారీగా అభివృద్ధి కార్యక్రమాలపై సీఏం రేవంత్రెడ్డి దృష్టి పెట్టారా? అందులో భాగంగా ఎమ్మెల్యేలను మీ నియోజకవర్గానికి ఏం కావాలో ఒక ఫుల్ డీటెయిల్ రిపోర్ట్తో రావాలని సూచించారా? ఆ దిశగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అయ్యారా? సదరు భేటీ లో అభివృద్ధితో పాటు ఎమ్మెల్యే వర్క్ షీట్ కూడా పరిగణలోకి తీసుకుంటున్నారా? అంటే ఔననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇంతకీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం సిఎం ఎలాంటి ప్రణాళిక రచించారు? ఏ తరహాఅభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వనున్నారు?
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావొస్తుంది. ఇప్పటి వరకు ఎన్నికలో ఇచ్చిన హామీల అమలు పై సర్కార్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్, 200 యూనిట్ ల వరకు ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు లు, సన్నబియ్యం పధకం, కులగణన, ఎస్సీ వర్గీకరణ, 42 శాతం బీసీ రిజర్వేషన్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు అమలు చేస్తోంది. ధరణి పోర్టల్ని మార్చి, భూ భారతి ఇంప్లిమెంట్ చేస్తోంది. 60 వేలకు పైగా ఉద్యోగాలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, విద్యార్థులకు ఇచ్చే మెస్ ఛార్జీల పెంపు, స్కిల్ యూనివర్సిటీ ఇలా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తోంది.
అయితే ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యే లు మళ్ళీ గెలవాలంటే ఎం చేయాలనే దాని పై దృష్టి పెట్టింది సర్కార్. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి హస్తం పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న పెండింగ్ పనులు ఏంటి…? చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? ఎన్నికలో మీరు ఇచ్చిన హామీలు ఏంటి? వాటిలో ఏది మొదటి ప్రాధాన్యత అనుకుంటున్నారు? మొత్తం నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు అవుతాయన్న వివరాలు సేకరిస్తున్నారంట. సదరు వివరాలతో డీటెయిల్ రిపోర్టు ఇవ్వాలని ఎమ్మెల్యేలకు సూచించారంట. ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో వన్ టూ వన్ కూర్చొని, చర్చించి ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? మొదటి లిస్ట్లో చేసే పనులు, వచ్చే ఏడాది చేసే పనులు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇచ్చే నిధుల గురించి వివరించడానికి ముఖ్యమంత్రి సిద్దమైన్నట్లు సమాచారం.
ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా హస్తం పార్టీ ఎమ్మెల్యే లతో చర్చించిన్నట్లు సమాచారం. జిల్లాలో గెలిచిన అందరితో గ్రూప్ మీటింగ్ నిర్వహించి, తర్వాత సింగల్గా వారి నియోజకవర్గం అభివృద్ధి కోసం తెచ్చిన రిపోర్ట్ చూసి, మాట్లాడి కొన్ని కార్యక్రమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. ఐతే కేవలం వారు తెచ్చిన రిపోర్ట్ మాత్రమే కాదు, సర్కార్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ మేరకు ప్రజలోకి వెళ్తున్నాయి?ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అర్హులైన వారందరికీ పధకాలు అందుతున్నాయా? నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలపై ఎలాంటి ప్రచారం చేస్తున్నారు? ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అడిగి తెలుసుకుంటున్నారంట
ఆ భేటీలకు సంబంధించి సీఎం స్వయంగా ఎమ్మెల్యే ల వర్క్ రిపోర్ట్ కూడా తెప్పించుకుని పరిశీలిస్తున్నారంట. ఎవరి పని తీరు ఎలా ఉందో? ఏం చేస్తున్నారో కూడా వారికి చూపిస్తున్నారట. ఎమ్మెల్యే లు గ్రౌండ్ లో ఉండి మంచిగా పని చేస్తూ, ప్రజలకి దగ్గర ఉంటూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వ పధకాలను, విధానాలను ప్రజలోకి తీసుకెళ్తేనే మళ్ళీ గెలుస్తారని లేదంటే కష్టమని కూడా చెప్పుకొస్తున్నట్లు సమాచారం.నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో పాటు ఏ ఎమ్మెల్యేకి ఏం చెప్పాలో ఆది చెప్పి పంపిస్తున్నారట . మరి చూడాలి సర్కారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు పునుకుంటుందోః? .. ఎమ్మెల్యే లు ఎలా పని చేస్తారో?