.భారత్ న్యూస్ హైదరాబాద్….జూన్ 5లోపు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు?
TG: నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో రాష్ట్రాన్ని తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గతేడాది మే 30న దేశంలోకి ప్రవేశించిన పవనాలు జూన్ 8న రాష్ట్రాన్ని తాకాయి. అదే ఈ ఏడాది మే 27నే కేరళలోకి ప్రవేశిస్తాయని IMD అంచనా వేయడంతో జూన్ 5 లోపే రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని IMD ఇప్పటికే ప్రకటించింది.