భారత్ న్యూస్ విజయవాడ,,పచ్చని కాపురం లో టాక్సీ డ్రైవర్ చిచ్చు!!
హైదరాబాద్, అక్టోబర్ 09
ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ
భర్తకు రూ.లక్షల్లో వేతనం, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు. విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్న ఆమె.. ఈ ఏడాది తన తల్లి అస్తికల నిమజ్జనం కోసం హైదరాబాద్కు రాగా.. ఇక్కడ ఓ ట్యాక్సీ డ్రైవర్ పరిచయమయ్యాడు. అతని మాయమాటలకు విని, భర్త ఇండియాలో ఉన్న సమయంలో లండన్ లోని ఓ పార్క్లో పిల్లలను వదిలేసి హైదరాబాద్కు వచ్చింది. భర్త ఫిర్యాదుతో ఆర్జీఐఏ పోలీసులు ఆమెను గోవాలో అదుపులోకి తీసుకుని మంగళవారం భర్త వద్దకు పంపించారు