ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులు పరిశీలన
తిరుమల (భారత్ న్యూస్ ) తిరుమలలోని ఎస్వీ మ్యూజియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి శనివారం పరిశీలించారు.
పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో ఆరా తీశారు. వేగవంతంగా పనులు పూర్తి చేసి మ్యూజియాన్ని భక్తుల సందర్శనకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ మ్యూజియం ఆఫీసర్ శ్రీమతి విజయలక్ష్మీ, డిప్యూటీ ఈవో (హెల్త్) శ్రీమతి ఆశాజ్యోతి, ఈఈ-1 శ్రీ సుబ్రహ్మణ్యం, డీఈ శ్రీ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.