శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం
- సామాన్య భక్తులకు పెద్ద పీఠ
- సౌకర్యవంతంగా శ్రీవారి మూలమూర్తి, వాహన సేవల దర్శనం
- టీటీడి కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తుల సంతృప్తి
- టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు తిరుమల (భారత్ న్యూస్ ) శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు, సామాన్య భక్తులకు ఎలాటి ఆసౌకర్యాం కలుగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందించిట్లు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు చెప్పారు. టీటీడీ సిబ్బంది సంయమనంతో, ప్రణాళిక బద్ధంగా, సీనియర్ అధికారుల పర్య వేక్షణలో సేవలందించారని తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం ఈవో, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ,
బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 4 నుండి 11వ తేదీ వరకు (8 రోజులు) నమోదైన వివరాలు
శ్రీవారి బ్రహ్మోత్సవాల ముఖ్యాంశాలు
- ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్టోబరు 4వ తేదీన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
-అక్టోబరు 5వ తేదీ పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున రూ. 13.45 కోట్లతో నూతనంగా నిర్మించిన వకుళమాతా వంటశాలను ప్రారంభించారు.
శ్రీవారి ఆలయం :
- 6 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
- 15 లక్షల మంది భక్తులు శ్రీవారి వాహన సేవలు విక్షించారు.
- గరుడసేవనాడు 82,043 మంది దర్శించుకున్నారు. కాగా, గరుడసేవలో దాదాపు 3.5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు.
- 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్.
- విక్రయించిన మొత్తం లడ్డూలు 30 లక్షలు.
- హుండీ కానుకలు రూ.26 కోట్లు.
- తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 2.60 లక్షలు.
- భక్తులకు 32,713 గదుల కేటాయించాం.
- బ్రహ్మోత్సవాల్లో 475 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం.
- కల్యాణవేదిక వద్ద వివిధ విభాగాల ద్వారా ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన నాడు -నేడు కాన్సెప్ట్తో ఫోటో ఎగ్జిబిషన్, అటవీ, శిల్ప కళాశాలలచే ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లు భక్తుల ప్రశంసలు అందుకున్నాయి.
- తిరుమలలో పలు ప్రాంతాల్లో దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లతోపాటు, 32 పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు. ఇందులో నాలుగు మాడ వీధులలో 23, ప్రధాన కూడళ్ళలో 9, ప్రత్యేకంగా తిరుపతిలో 7 డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశాం.
అన్నప్రసాదం :
- బ్రహ్మోత్సవాల 8 రోజుల్లో 26 లక్షల భోజనాలు, అల్పాహారం అందించడమైనది.
- గరుడసేవనాడు 8.71 లక్షల మందికి అన్నప్రసాదాలు, అల్పాహారం, 3.47 లక్షల మందికి టి, కాఫి, పాలు, బాదం పాలు, 4 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 4 లక్షల తాగునీరు బాటిళ్ళు, స్నాక్స్గా సుండలు, బిస్కెట్లు అందించడం జరిగింది.
వైద్యం :
- 45 మంది డాక్టర్లు, 60 మంది పారామెడికల్ సిబ్బందిని, 13 అంబులెన్సులు వినియోగించడమైనది.
- 68 వేల మందికి పైగా భక్తులకు వైద్యసేవలు.
ఆరోగ్య విభాగం :
- తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్యం కోసం 1365 మంది సిబ్బంది, గరుడ సేవ రోజు అదనంగా 600 మంది సిబ్బంది ఏర్పాటు.
టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టులు :
- హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 18 రాష్ట్రాల నుండి వచ్చిన 261 కళాబృందాల్లో 6,884 మంది కళాకారులు కళారూపాలను ప్రదర్శించారు. వాహన సేవలతో పాటు తిరుమల, తిరుపతిలో ప్రదర్శించిన కళాకృతులు విశేషంగా అకట్టుకున్నాయి. భక్తులు ఎంతో సంతోషించారు.
ఉద్యానవన విభాగం :
- శ్రీవారి ఆలయంతో పాటు పలు కూడళ్ళు, అతిథి గృహాల వద్ద శోభాయమానంగా పుష్పాల అలంకరణలు, పుష్పప్రదర్శన.
- బ్రహ్మోత్సవాలలో 40టన్నులు పుష్పాలు, 3.50 లక్షల కట్ ఫ్లవర్స్, 80 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగం.
ప్రజాసంబంధాల విభాగం :
- రాంభగీచా-2లో మీడియా సెంటర్, కల్యాణవేదిక వద్ద నాడు – నేడు ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు.
- దాదాపు 7 రాష్ట్రాల నుండి విచ్చేసిన 4 వేల మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు.
- గతంలో ఉన్న 5 సమాచార కేంద్రాలతో పాటు తిరుమలలో మరో 5 సమాచార కేంద్రాలు, తిరుపతిలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశాం.
- అదేవిధంగా భక్తులకు విరివిగా సమాచారం ఇచ్చేందుకు శ్రీవారి సేవకుల సహకారంతో దాదాపు 11 ప్రాంతాలలో మే ఐ హెల్ప్ యు కౌంటర్లను నిర్వహించాం.
- టీటీడీ కాల్ సెంటర్, కమాండ్ కంట్రోల్ సెంటర్, సమాచార కేంద్రాలు, మీడియా, శ్రీవారి సేవకుల ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాం.
- తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుండి మరోక ప్రాంతానికి ఉచితంగా రవాణా చేసేందుకు 14 ధర్మ రథాలను ఏర్పాటు చేశాం.
ఎపిఎస్ఆర్టిసి :
- 9.53 లక్షల మంది ఎపిఎస్ఆర్టిసి ద్వారా తిరుమలకు రాక పోకలు సాగించారు.
- గరుడసేవనాడు ఆర్టిసి బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు 2,764 ట్రిప్పుల్లో 97,402 మంది భక్తులను చేరవేశాయి. తిరుమల నుంచి తిరుపతికి 2,711 ట్రిప్పుల్లో 89,181 మంది భక్తులను చేరవేశాయి.
- బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంలో పాలుపంచుకున్న అర్చక స్వాములు, అధికారులు, సిబ్బంది, కళాకారులు, శ్రీవారి సేవకులు, ఎన్సిసి విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాను.
- అలాగే, బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్నివిధాలా సహకరించిన జిల్లా యంత్రాంగం, పోలీసు, ఆర్టీసీ, ఇతర ప్రభుత్వ విభాగాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
- బ్రహ్మోత్సవాల వైభవాన్ని భక్తులకు చేరువ చేసిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.