..భారత్ న్యూస్ అమరావతి..సమస్యల పరిష్కార వేదికగా నిలుస్తున్న మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్”

ప్రజా విజ్ఞప్తులపై అప్పటికప్పుడే మంత్రి ఆదేశాలు

మంత్రి చొరవ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న బాధితులు

42వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ

అమరావతిః గత వైసీపీ ప్రభుత్వంలో సమస్యల పరిష్కారం కోసం తిరిగితిరిగి వేసారిన ప్రజలకు కూటమి ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ చేపట్టిన “ప్రజాదర్బార్” అండగా నిలుస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు 42వ రోజు నిర్వహించిన “ప్రజాదర్బార్” కు తరలివచ్చారు. మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రజా విజ్ఞప్తులను పరిశీలించిన మంత్రి.. ఆయా విన్నపాల పరిష్కారం కోసం అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అండగా నిలిచేందుకు మంత్రి చూపిస్తున్న చొరవ పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తులు

గత ప్రభుత్వం నిలిపివేసిన రైతు కూలీ పెన్షన్ ను పునరుద్ధరించండి

  • తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తనకు ఎలాంటి ఆధారంలేదని, ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని దుగ్గిరాల మండలం రేవేంద్రపాడుకు చెందిన పి.సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
  • హెచ్ఐవీ వ్యాధితో బాధపడుతున్న తనకు మందుకు కొనుగోలు చేసేందుకు కూడా ఆర్థిక స్థోమత లేదని, పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవడంతో పాటు ఇల్లు మంజూరు చేయాలని యర్రబాలెంకు చెందిన షేక్ నసీమ కోరారు. పరిశీలించి తగిన విధంగా ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
  • పక్షవాతంతో బాధపడుతున్న తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని కుంచనపల్లికి చెందిన బి.కృపారావు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
  • ఇంజనీరింగ్ చదివిన తమ కుమారుడికి ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని తాడేపల్లి మండలం నులకపేటకు చెందిన ఏ.పెద్దిరాజు కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
  • గత ప్రభుత్వం నిలిపివేసిన రైతు కూలీ పెన్షన్ ను పునరుద్ధరించాలని యర్రబాలెంకు చెందిన సీహెచ్ రమాదేవి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు

పులివాగు ఆక్రమణలు తొలగించండి

ఇటీవల విజయవాడలో సంభవించిన వరదలకు తమ ఇళ్లు నీట మునిగి ఇంట్లోని సామాగ్రి, నిత్యవసరాలు పాడైపోయాయని, ద్విచక్రవాహనాలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని,…

ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులోని పులివాగు ఆక్రమణలు తొలగించి, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన గుంటక సుబ్బారెడ్డి మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. పులివాగు ఆక్రమణలతో తమ పంటలు ప్రతి ఏడాది ముంపునకు గురై తీవ్రంగా నష్టపోతున్నాం. పులివాగు హిందూ స్మశాన వాటిక నుంచి విజయవాడ-భద్రాచలం రోడ్డుపై నిర్మించిన వంతెన వరకు ఇరువైపులా భారీగా ఆక్రమణలకు గురై వాగు కుచించుకుపోయింది. దీంతో వర్షాకాలంలో సంభవిస్తున్న వరదలకు పంట పొలాలు నీట మునుగుతున్నాయి. అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. వరదల బారిన పడకుండా గ్రామాన్ని రక్షించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

కడప జిల్లా కలసపాడు మండలం ముద్దంవారిపల్లికి చెందిన గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. శంకవరం గ్రామ రెవెన్యూ పరిధిలో తమకు వారసత్వంగా సంక్రమించిన సుమారు 20 ఎకరాల ఈనాం భూములను సగిలి బాలచిరంజీవి, సగిలి పుల్లయ్య, మేక ఓబయ్య, దేవరాజు, మరికొందరు కలిసి ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో సదరు భూములను ఆన్ లైన్ లో నమోదు చేయించి.. తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోయారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

తిరుపతిలోని శీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గత మూడేళ్ల నుంచి పనిచేస్తున్న 30 మంది బోధనేతర సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించారని, తిరిగి తమను విధుల్లోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని నాన్ టీచింగ్ సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

ఎన్టీఆర్ జిల్లా కొత్తపేటలోని తమ 1.10 ఎకరాల భూమిని గరిమెళ్ల నరసింహారావు అనే వ్యక్తి కబ్జా చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, విచారించి తగిన న్యాయం చేయాలని గుదె వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. అధికారులకు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. వృద్ధాప్యంలో ఉన్న తమకు న్యాయం చేయాలని కన్నీటిపర్యంతమయ్యారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.