భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,ఏపీ హైకోర్టు ఆన్లైన్ విచారణలోకి నగ్నంగా వచ్చిన వ్యక్తి.. అందరూ అవాక్కు…చివరికి ఏమైంది అంటే!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆన్లైన్ విచారణ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి నగ్నంగా కనిపించడం కలకలంరేపింది. ఈ నెల 15న హైకోర్టులో ఓ కేసు విచారణ జరుగుతున్న సమయంలో.. ఓ వ్యక్తి మంచంపై నగ్నంగా పడుకుని ఆన్లైన్ ద్వారా ప్రత్యక్షం అయ్యాడు. ఈ విషయాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.. అతడి గురించి వెంటనే ఆరా తీశారు. 17వ కోర్టు విచారణలోకి కిట్టు అనే యూజర్ ఐడీతో ఓ వ్యక్తి యాప్ ద్వారా లాగిన్ అయ్యాడు. అతడి ఒంటిపై దుస్తులు లేకుండా మంచంపై పడుకొని మాట్లాడుతూ కనిపించాడు.
హైకోర్టు కోర్టు విచారణకు ఉద్దేశపూర్వకంగా విఘాతం కలిగించాడని సీరియస్గా తీసుకున్నారు. వెంటనే కోర్టు సిబ్బంది అప్రమత్తం అయ్యారు.. ఆ లాగిన్ను బ్లాక్ చేశారు. వెంటనే లాగిన్ వివరాలను పరిశీలించిన అనంతరం హైకోర్టు ఐటీ రిజిస్ట్రార్ ఏడుకొండలు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సుప్రీం కోర్టు.. ప్రజలకు న్యాయాన్ని దగ్గర చేయాలని, లాయర్లు, పిటిషన్లు దాఖలు చేసినవారికి విచారణ సమయంలో సౌకర్యంగా ఉండాలని ఆన్లై