..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో నవంబర్ 2 నుంచి కొత్త కార్యక్రమం అమలు….
‘మిషన్ పాటోల్ ఫ్రీ ఏపీ’ కార్యక్రమం మొదలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నెల నవంబర్ 2 నుంచి ‘మిషన్ పాటోల్ ఫ్రీ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆరంభిస్తోంది.
సీఎం చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా ఎస్.కోటలో రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టనున్నారు. అన్ని నియోజక వర్గాల్లో రోడ్లకు ఇరువైపులా కంపచెట్ల తొలగింపు, గుంతలు పూడ్చడం, కల్వర్టుల నిర్మాణం వంటి పనులు చేపడతారు. ఇందుకోసం రూ.860 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. జనవరి
నాటికి పనులు పూర్తిచేయాలని ఆదేశించింది.