భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో జరగబోయే గోదావరి పుష్కరాలకు కేంద్రం రూ.100 కోట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గోదావరి నది
పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు నిధులు విడుదల చేసింది.
తూర్పుగోదావరి జిల్లాకు గోదావరి పుష్కరాలు నిర్వహించడం కోసం
రూ.100 కోట్లనిధులు కేటాయింపులు జరిగాయి.
2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని అఖండ గోదావరి ప్రాజెక్ట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాకు ఈ నిధులు కేటాయించారు. ఈ దిశగా టూరిజం శాఖ అధికారులు పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి.