..భారత్ న్యూస్ అమరావతి..ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి.

దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తాం.

ఇచ్చిన మాట ప్రకారం చెత్తపన్ను రద్దు చేశాం.

మత్య్సకారుల పొట్టగొట్టే 217 జీవో రద్దు చేశాం.

స్వర్ణకారులు కార్పొరేషన్ పెట్టాం

గీత కులాలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు ఇచ్చాం

అర్చకుల జీతాలు రూ.10 వేలకు పెంపు

నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలకు వేతనం పెంపు

ధూపదీప నైవేద్యాలకు రూ.5 వేల నుండి 10 వేలకు పెంచాం

వేద పాఠశాలల్లో చదువుకున్న వారికి నిరుద్యోగ భృతి రూ.3 వేలు కూడా అందిస్తాం

చేనేత వస్త్రాలకు జీఎస్టీ ఎత్తేయాలని కేంద్రాన్ని కోరతాం…కేంద్రం ఇవ్వకపోతే రీయింబర్స్ చేస్తాం.

చేనేత కార్మికుల ఇళ్ల నిర్మాణాలకు అదనంగా రూ.50 వేలు అందిస్తాం.

పారదర్శక పాలనలో భాగంగా జీవోలు కూడా ఆన్ లైన్ లో పెట్టాం.

రాజధాని ఒక్కటే ఉంటుంది…అది అమరావతే. విశాఖ ఆర్థిక రాజధానిగా ఉంటుంది.

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం.

ఓర్వకల్లు, ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేస్తాం.

రైతులకు డ్రిప్ లు అందిస్తున్నాం.

పాడి రైతులకు 90 శాతం సబ్సిడీతో షెడ్లు నిర్మిస్తున్నాం.

విశాఖ రైల్వే జోన్ క్లియర్ అయ్యింది

రాజధాని రైతులకు రూ.400 కోట్లు బకాయిలు చెల్లించాం.

శాంతిభద్రతల విషయంలోనూ రాజీ పడకుండా నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నాం.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు జనాభా దామాషా ప్రకారం పదవులు ఇస్తున్నాం.

ఇంటి నిర్మాణానికి రూ.4.30 లక్షలు ఇవ్వడంతో పాటు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం అందిస్తాం.