..భారత్ న్యూస్ అమరావతి..Nitin Gadkari : ప్రయాణంలో తోడు నీడగా..
హైవేల వెంట ఫుడ్‌కోర్టులు, ట్రామా సెంటర్లు, ఫార్మసీలు
రిపేర్‌ షాపులు, ఏటీఎంలు మరెన్నో సౌకర్యాలు
అంతర్జాతీయ ప్రమాణాలతో కేంద్రం ‘హమ్‌ సఫర్‌’ పాలసీ
ప్రారంభించిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ
రాన్నున్న రోజుల్లో రోడ్డు భద్రత, ప్రయాణ సౌకర్యాలకు ‘హమ్‌ సఫర్‌’ పర్యాయ పదంగా మారుతుందన్నారు. ఈ సౌకర్యాలన్నింటినీ పర్యావరణ హితమైన పద్ధతిలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. హమ్‌ సఫర్‌ పాలసీతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహంతో పాటు ఉద్యోగాల సృష్టి జరుతుందని గడ్కరీ చెప్పారు. ‘‘ఎవరైతే ప్రయాణికుల నుంచి టోల్‌ వసూలు చేస్తారో.. వాళ్లు ప్రయాణికులకు భద్రత, సౌకర్యాలు కల్పించాలి’’ అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
పెట్రోలు బంకుల యజమానులు నిబంధనల ప్రకారం ప్రయాణికులకు కనీస వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. హైవేలపై ఉన్న పెట్రోల్‌ బంకుల్లో టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచడం తప్పనిసరని చెప్పారు. చాలా పెట్రోల్‌ బంకుల్లో టాయిలెట్లకు తాళం వేసి ఉండటం తాను గమనించానని తెలిపారు. అలా ఉంటే పెట్రోల్‌ బంకులను మూసేస్తామని హెచ్చరించారు.