..భారత్ న్యూస్ అమరావతి..Vijay: ‘దేవుడు లేడన్న పెరియార్ మాటలకు మేం వ్యతిరేకం’.. తొలి బహిరంగ సభలో విజయ్ కామెంట్స్*
తమిళగ వెట్రిక్ కళగం పార్టీ పేరుతో పొలిటికల్ అరంగేట్రం చేస్తున్నారు..తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్. ఇప్పటికే పార్టీ పేరు, జెండా ప్రకటించిన విజయ్..తొలి బహిరంగ సభను గ్రాండ్గా నిర్వహించారు. తమిళనాడులోని విల్లుపురం వేదికగా జరిగిన సభకు..లక్షల సంఖ్యల అభిమానులు తరలివచ్చారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుందని నిర్వాహకులు ముందుగానే ప్రకటించినప్పటికీ..అభిమానాలు మాత్రం ఉదయం నుండి సభా ప్రాంగణానికి వేలాదిగా తరలివచ్చారు.
అన్నట్టుగానే సాయంత్రం నాలుగు గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు విజయ్. 800 మీటర్ల పొడవైన ర్యాంప్పై సింగిల్గా వాక్ చేస్తూ..అభిమానులకు అభివాదం చేశారు. అభిమానులు స్టేజ్ మీదకు విసిరిన కండువాలను తన భుజాన వేసుకుని వారిని ఆనంద పర్చారు..ఇళయ దళపతి
మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు
మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటినుంచే పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు విజయ్ సన్నాహాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే మహానాడు పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. పార్టీ ఏర్పాటు చేసిన ఉద్దేశంతో పాటు తన పార్టీ సిద్ధాంతాలు, వచ్చే ఎన్నికల్లో తన అజెండాపై ఈ మహానాడు వేదికపైనుండి ప్రజలకు స్పష్టత ఇచ్చారు విజయ్.
తమిళనాడు రాజకీయాల్లో తాను ఎవరికీ A టీమ్గానీ..B టీమ్గానీ కాదని స్పష్టం చేశారు..విజయ్. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీవీకే పోటీ చేస్తుందన్నారు. సిద్ధాంతపరంగా బీజేపీని..రాజకీయంగా డీఎంకేని వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. ఇక్కడ కొంతమంది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పాట పాడుతూ..ఆ రంగులు వేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అండర్గ్రౌండ్ డీలింగ్ చే�