..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో దీపావళి కానుక.. రూ.2,684 కోట్లు మంజూరు

ఏపీలో దీపావళి కానుకగా సూపర్ సిక్స్ లో భాగంగా ఉచిత సిలిండర్ల పథకం అమల్లోకి తీసుకురాబోతోంది
కూటమి ప్రభుత్వం.ఇప్పటికే దీనికి సంబంధించిన గ్యాస్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ఈ పథకం కింద లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెబుతూ దీపం-2 పథకానికి రూ.2,684కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.మొదటి విడతకు అయ్యే ఖర్చు రూ. 894 కోట్లు మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు.