భారత్ న్యూస్ విజయవాడ…మరో రూ.7వేల కోట్ల రుణానికి కేంద్రం అనుమతి

ఏపీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకుగాను కేంద్రం అనుమతిచ్చిన రూ.47,000
కోట్ల రుణ పరిమితి సెప్టెంబర్లో ముగిసిపోయింది.దీంతో కొత్తగా అక్టోబర్-డిసెంబర్ మధ్య మరో రూ.7,000 కోట్ల అప్పునకు ఓకే చెప్పింది. ఇది అడ్వాన్స్ మాత్రమేనని, మిగిలింది ఇంకా ఖరారు చేయాల్సి ఉందని పేర్కొంది. కాగా ఈ ఆర్ధిక సంవత్సరంలో
సెక్యూరిటీల వేలం ద్వారా ప్రభుత్వం రూ.50,000 కోట్ల అప్పు చేసింది.